టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి పాజిటీవ్ వచ్చింది. దాంతో మహమ్మారి బారిన పడిన నాలుగో కేకేఆర్ ప్లేయర్గా ప్రసిద్ నిలిచాడు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టీమ్ సిఫెర్ట్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. లీగ్ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఆటగాళ్లంతా తమ స్వస్థలలాకు బయలదేరారు. వారంతా బబుల్ను వీడే ముందు నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రసిద్ కూడా అహ్మదాబాద్లో కేకేఆర్ క్యాంప్ వీడే ముందు పరీక్షలు చేయించుకున్నాడు. కానీ అక్కడ అతనికి నెగటివ్ వచ్చింది. తీరా బెంగళూరు చేరుకున్న తర్వాత అతని పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ వచ్చింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు ప్రసిద్ కృష్ణ స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేశారు. ఇంతలోనే అతను కరోనా బారిన పడ్డాడు. అయితే ఇంగ్లండ్ ప్రయాణానికి ఇంకా గడువు ఉండటంతో అతను కోలుకునే అవకాశం ఉంది.
previous post
next post
జనాలను చంపడంలో కేసీఆర్ నంబర్ వన్: వీహెచ్