telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విభజన ప్రకారమే పోలవరానికి జాతీయ హోదా: కిషన్ రెడ్డి

Kishan Reddy

రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని తాము చెప్పలేదని అన్నారు. విభజన ప్రకారమే తాము పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి కార్మికులతో చర్చలు జరపాలని సూచించారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అనే ప్రతిపాదన తమ వద్దలేదని స్పష్టం చేశారు.

Related posts