కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో సారి టీఆర్ఎస్ పార్టీపై కౌంటర్ వేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ రాజకీయాలకు ప్రతి రాష్ట్రంలో మార్పు తెస్తున్నారని… బల్దియా కాయ, పియా, చల్, దీయ కాదు మార్పు రావాలని పేర్కొన్నారు. దేశంలో 17 రాష్ట్రాలు ప్రశాంతంగా ఉంటే.. ఈ రాష్ట్రంలో మాత్రం అరాచకం తెస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. అరాచకం కాదు.. అరాచక శక్తులను కూకటివేళ్ళతో పీకేస్తామని హెచ్చరించారు కిషన్రెడ్డి. మమ్మల్ని ప్రశ్నించే అధికారం కల్వకుంట్ల కుటుంబానికి లేదని తెలిపారు. భారతీయ జనత పార్టీ హైదరాబాద్ మార్పు కోరుకుంటుందని… నీతి నిజాయితీ కావాలి సీఎం ను నేరుగా కలిసే తెలంగాణ కావాలన్నారు. చేంజ్ హైదరాబాద్ ద్వారా ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ రోజు హైదరాబాద్ మార్పు.. రేపు తెలంగాణ లో మార్పు అని తెలిపారు. ఫార్మ్ హౌస్ లో పడుకునే సీఎం వద్దు, సెక్రటేరియట్ లేని, సెక్రటేరియట్ కి రాని సీఎం మనకు వద్దని తెలిపారు.
previous post
next post