ఉత్తరకొరియాలో కిమ్ ఆరోగ్యం క్షీనిస్తుందన్న వార్తలు రావటంతో కిమ్ తర్వాత ఆయన వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారన్న చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన సోదరి కిమ్ యో జాంగ్ అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఉత్తర కొరియా దేశంపై కిమ్ యో జాంగ్ పూర్తిగా పట్టు సాధించారని సమాచారం. ఈ మేరకు శత్రు దేశాలకు ఉత్తర కొరియా హెచ్చరికలు కూడా పంపినట్లు తెలుస్తోంది. అన్న కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలన్నింటిని చిన్నప్పటి నుంచే ఆయన సోదరి కిమ్ యో జాంగ్ వంటపట్టించుకున్నారట. ఇక ఆ మధ్య ఈమె దక్షిణ కొరియాను కుక్క మొరుగుతోందంటూ హెచ్చరించడం పెద్ద దుమారానికి దారి తీసింది. అంతేకాకుండా ఈమె తన అన్నకిమ్, డొనాల్డ్ ట్రంప్తో కలిసి రెండు సమ్మిట్లకు కూడా హాజరయ్యారు. నార్త్ కొరియాను ముందుండి నడిపించేది కిమ్ అయితే.. ఆయనకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వెనక నుంచి ప్రణాళికలు రచించేది కిమ్ యో జాంగ్ అని అక్కడి రాజకీయ నాయకులు అంటున్నారు. అటు పాలనా వ్యవహారాల్లో కిమ్ ఒక్క తన చెల్లెలు అయిన కిమ్ యో జాంగ్ను మాత్రమే నమ్ముతారట. ఇక కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి మరింత డేంజర్ అని ఆ దేశస్థులు చెబుతున్నారు.
previous post