తెలుగులో “భరత్ అనే నేను” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ భామ హిందీలో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో తనలోని హాట్ నెస్ బయటపెట్టి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన “అర్జున్ రెడ్డి ” రీమేక్ “కబీర్సింగ్” చిత్రంతో కెరీర్లో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్తో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. కియారా అద్వానీ తాజాగా కోలీవుడ్లో తొలి అడుగు వేయబోతున్నది. విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. సామాజిక ఇతివృత్తానికి యాక్షన్ అంశాలను మేళవిస్తూ రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్కి జోడీగా కియారా అద్వాణీ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న, కీర్తిసురేష్తో పాటు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు ఈ అవకాశం కియారా అద్వానీని వరించిందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.