కాంగ్రెస్ పార్టీ వీడిన నేతల పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా స్పందించారు. బయటకు వెళ్లిన నేతలంతా ఒంటరి అయ్యాక తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుతారని చెప్పుకొచ్చారు. వలసలతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని కుంతియా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో చూసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్సే గట్టిపోటీ అంటూ వ్యాఖ్యానించారు. కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని ఆందోళన చెందవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు..
previous post
అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స