telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో పని చేయనున్న “కేజీఎఫ్” దర్శకుడు

PRashanth-Neel-with-Mahesh-and-NTR

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో యశ్‌, సంజ‌య్ ద‌త్‌, ర‌వీన్ టాండ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో చిత్ర విడుద‌ల‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్… రాజమౌళి స్థాయిలో భారీ యాక్షన్ సినిమాలు తీయగలడని గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు ప్రశాంత్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రశాంత్ చూపు మాత్రం టాలీవుడ్ మీద ఉంది. టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. ఆ ముగ్గురు స్టార్ హీరోలు.. ఎన్టీయార్, మహేష్ బాబు, ప్రభాస్. ఈ ముగ్గురూ ప్రశాంత్‌కు ఓకే చెప్పేశారట. ముందుగా ఎన్టీయార్‌తో సినిమా చేస్తాడట. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా మహేష్, ప్రభాస్‌లతో సినిమాలు చేయాలని ప్రశాంత్ భావిస్తున్నాడట.

Related posts