“బాహుబలి” తర్వాత అదే స్థాయిలో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న దక్షిణాది సినిమా “కేజీఎఫ్”. కన్నడ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన “కేజీఎఫ్” కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీస్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక “కేజీఎఫ్-2” తర్వాత ప్రశాంత్ ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ప్రశాంత్ తెలుగు సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే ఆ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ప్రభాస్ ఆ సినిమాలో హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post