telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కేజీఎఫ్‌’ భామకు భారీ నష్టం.. !

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌వీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది.  కేజీఎఫ్‌’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఏకంగా ఏడు సినిమాలు వదులుకుందట. అప్పుడు గానీ ఆమె ‘కేజీఎఫ్‌ చాప్టర్ 2’లో కనిపించటం వీలు పడలేదట! ‘కేజీఎఫ్’ పార్ట్ వన్ సైలెంట్ గా వచ్చి… వయొలెంట్ గా హిట్టైంది. హీరో యశ్ అమాంతం ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా బాగా డిమాండ్ పెంచుకుంటున్నాడు. ‘బాహుబలి’ ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే, వీళ్లందరి మధ్యలో ‘కేజీఎఫ్‌’ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి తగినంత పేరు రాలేదనే చెప్పాలి. అయినా కూడా ఆమెకు బోలెడు డిమాండ్ పెరిగిందట. ఆఫర్లు వచ్చాయట. కానీ, ‘కేజీఎఫ్‌’ వల్ల వచ్చిన క్రేజ్ ‘కేజీఎఫ్‌ 2’ వల్ల డిస్టబ్ అయిందట! పైగా కరోనా లాక్ డౌన్ శ్రీనిధికి మరింత నష్టం చేసిందట! ‘కేజీఎఫ్‌’ అనూహ్య విజయంతో చాప్టర్ టూకి ఎక్కడలేని ఎదురు చూపులు మొదలయ్యాయి. దాంతో దర్శకనిర్మాతలు ముందు అనుకున్న దాని కంటే తొందరగా రెండో భాగం నిర్మాణం మొదలు పెట్టారు. మరి హీరోయిన్ గా శ్రీనిధినే కొనసాగుతుంది కదా? అదే జరిగింది. కానీ, పార్ట్ వన్ తరువాత ఆమె చేద్దామనుకున్న చాలా సినిమాలు ‘కేజీఎఫ్‌ 2’ వల్ల చేయలేకపోయిందట. బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ కోసం ఆమె షూటింగ్ చేస్తుంటే… మూడు కన్నడ, రెండు తమిళం, రెండు తెలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చి వెళ్లిపోయాయంటోంది శ్రీనిధి.

Related posts