telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మున్సిపాలిటీలపై ఏపీ సర్కార్‌ కీలక అర్డినెన్సు…

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలుగా మారుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది. పురపాలక చట్ట సవరణ తీసుకొచ్చేందుకు ముందుగా ఆర్డినెన్సును జారీ చేసింది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి అమరావతి పరిధిలోని గ్రామాలు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, బాపట్ల, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, కందుకూరు మున్సిపాలిటీల్లోకి సమీప గ్రామ పంచాయతీలు విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అమరావతి రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాలు మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చిన సర్కార్… నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు, చిన కాకాని, ఆత్మకూరు, కాజా, నూతక్కి, చిన, పెదవడ్లపూడి, రామచంద్రపురం మొత్తం 11 గ్రామాలకు మంగళగిరి మున్సిపాలిటీ లో విలీనం చేసింది. ఇక తాడేపల్లి మున్సిపాలిటీలో పెనుమాక, ఉండవల్లి, ప్రాతురు, వడ్డేశ్వరం, కుంచంపల్లి, కొలనుకొండ తదితర ప్రాంతాలు. అలాగే పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని 5 గ్రామాలు, తణుకు, భీమవరం పరిధిలో సమీపంలో ఉన్న 4 గ్రామాల చొప్పున విలీనం చేసింది. బాపట్ల పరిధిలో 8 గ్రామ పంచాయతీలు, కందుకూరు పరిధిలో 10 గ్రామాలు విలీనం చేయగా… రాష్ట్రంలో 6 చోట్ల చిన్న స్థాయి పట్టణ ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది. విజయవాడలో రూరల్ ప్రాంతలనైన కానూరు, పోరంకి, తాడిగడప, యనమల కుదురు తదితర ప్రాంతాలను కలుపుతూ వైఎస్సార్ తాడిగడపగా మార్పు చేసింది. రాజాం, నెల్లూరు జిల్లా అల్లూరు, బి.కొత్తకోట, చింతలపూడి, పొదిలి తదితర పరిధిలో విస్తరించిన గ్రామాలు ఇక నగర పంచాయతీలుగా మార్పులు చేసింది ప్రభుత్వం.

Related posts