telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాని, వెంకన్నల మధ్య ట్వీట్ల యుద్ధం.. హైకమాండ్ నుంచి ఫోన్లు

budda venkann- kesineni twitter

టీడీపీ ఎంపీ కేశినాని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరి ట్వీట్ల యుద్ధం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి వైఖరితో పార్టీకి సరికొత్త తలనొప్పి ప్రారంభమైంది. పార్టీ శ్రేణులు కూడా వీరి వైఖరితో ఆవేదన చెందుతున్నారు.

దీంతో, పార్టీ హైకమాండ్ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. టీడీపీ హైకమాండ్ నుంచి ఇద్దరికీ ఫోన్లు వెళ్లాయి. కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు ఫోన్ చేసి సంయమనం పాటించాలని ఇరువురికీ సూచించింది. దీంతో చంద్రబాబు కోసం, పార్టీ కోసం ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నట్టు బుద్దా వెంకన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Related posts