ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధాని మార్పు పై సీఎం జగన్ నిర్ణయంపై ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని కేశినేని నాని ఆరోపించారు. రాజధానికి ద్రోహం చేసి చరిత్ర హీనులుగా మారొద్దని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
అమరావతి రాజధాని కోసం ప్రజలంతా పోరాటం చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఉన్న కోపంతో జగన్.. రాజధానిని మార్చడమేంటీ? అని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.