telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మహిళా కానిస్టేబుల్ ను సజీవదహనం చేసిన మరో కానిస్టేబుల్

Soumya-Pushpakaran

తన మాట వింతలేదన్నా నెపంతో ఓ పోలీస్ మహిళా కానిస్టేబుల్ ను అతికిరాతకంగా హతమార్చిన ఘటన కేరళ లో చోటుచేసుకొంది. అలప్పుజ జిల్లాలోని వళ్లికున్నం ప్రాంతానికి చెందిన సౌమ్య పుష్పకరన్ పౌర పోలీసు అధికారి (సీవోపీ)గా పనిచేస్తున్నారు. శనివారం విధులు పూర్తయిన తర్వాత ఆమె తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎజాస్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను కారులో వెంబడించి ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయారు.

వెంటనే దుండగుడు పదునైన కత్తితో ఆమెపై దాడి చేశాడు. పరుగెత్తుతుండగా వెంటాడి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొనిఆసుపత్రికి తరలించారు. .మృతురాలు సౌమ్య పుష్పకరన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త విదేశాల్లో పనిచేస్తున్నాడు. గతంలో వారిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం ఉందని, ప్రస్తుతం అజాస్ ను ఆమె దూరం పెట్టిందని, ఆ కోపంతోనే ఆమెపై దాడి చేశాడని పోలీసులు అంటున్నారు. 

Related posts