దేశంలోని యూనివర్సిటీల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కవితను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ఆహ్వానించారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.
అదేరోజు మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ కాంప్లెక్స్లో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ యూనివర్సిటీల నుంచి 18 నుంచి 30 ఏండ్ల వయస్సున్న రెండువేల మంది విద్యార్థులు పాల్గొంటారని స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు.