telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంపీ కవితకు కేరళ స్పీకర్ ఆహ్వానం

MP Kavitha comments BBP Govt.

దేశంలోని యూనివర్సిటీల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కవితను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ఆహ్వానించారు. కేరళ అసెంబ్లీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

అదేరోజు మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ యూనివర్సిటీల నుంచి 18 నుంచి 30 ఏండ్ల వయస్సున్న రెండువేల మంది విద్యార్థులు పాల్గొంటారని స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు.

Related posts