telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అయోధ్య తీర్పుపై స్పందించని కేసీఆర్..విజయశాంతి విమర్శలు

Congress vijayashanti comments Modi Kcr

అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల స్పందించని కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సోషల్ మీడియాలో ఘాటు విమర్శలు చేశారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించకుండా, తప్పించుకోవడం వెనక చాలా మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

దేశమంతా రామమందిరం నిర్మాణానికి సంబంధించి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంటే… తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యూలరిజం పేరుతో ఎంఐఎం ప్రాపకం కోసం సుప్రీం తీర్పుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. పైకి తాను అసలైన హిందువు అని చెప్పుకునే కేసీఆర్ గారికి.. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతంలో ఆయన చేసిన కామెంట్‌ను చూస్తే అర్థమవుతుంది.

రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని… అయోధ్య అంశాన్ని తోకతో పోలుస్తూ గతంలో కేసీఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనం. ఇంతకు ముందు తన మనసులోని మాటను బయటపెట్టిన కేసీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేకపోతున్నారేమో? దీన్నే కుహనా లౌకిక వాదం అంటారని విజయశాంతి తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

Related posts