telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రగతి భవన్ లో కరోనాపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం…

Kcr telangana cm

సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం.  కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.   ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.  ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.  ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్న కేసీఆర్ కొన్నిరోజులు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నారు.  కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో కేసీఆర్ తిరిగి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకున్నారు.  ఏప్రిల్ 20 వ తేదీ నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతున్నది.  మే 8 వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుండటంతో దీనిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి చూడాలి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది.

Related posts