telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఖైరతాబాద్ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేత రాజు యాదవ్ నేతృత్వం లో ఖైరతాబాద్ చౌరస్తా లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

రైతుల సమస్యలు తెలుసుకునేందుకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎర్రవల్లి లో చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పాటు రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు కలిగించారని మండిపడ్డారు.

రైతుల సమస్యలను రేవంత్ రెడ్డి తెలుసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Related posts