telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

టీడీపీ ఎమ్మెల్యేకి కేసీఆర్ బంపర్ ఆఫర్

Woman candidates kcr cabinet Telangana
తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం  జిల్లాలో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యేగా  మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. సండ్ర ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు గతంలో చెప్పిన విషయం విధితమే. మరో వైపు ఎమ్మెల్యే  మెచ్చా నాగేశ్వరరావు  గత కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఇప్పటి వరకు పార్టీ మారలేదు. 
తాజాగా మెచ్చా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరితే గిరిజన మంత్రి ఇస్తానని కేసీఆర్‌ చెప్పారని మెచ్చా చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌లో చేరడం ఇష్టలేదని, టీడీపీలో కొనసాగడమే ఇష్టమన్నారు. డబ్బులు, పదవులకు లొంగే వ్యక్తిని కానని మెచ్చా మీడియాకు వెల్లడించారు.

Related posts