telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నాం: కేసీఆర్

Kcr telangana cm

కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కరోనా మరణాల గురించి చెబుతూ వ్యాధి కంటే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు. కరోనా నివారణ చర్యలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టేందుకు ఆయన ప్రయత్నించారు.

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం ఉందని అన్నారు. ఇదేదో తెలంగాణకు మాత్రమే వచ్చిన విపత్తు అన్నట్టుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో భట్టి విక్రమార్క పునరాలోచన చేయాలని హితవు పలికారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, అక్కడేం చేస్తున్నారో ఓసారి గమనించాలని తెలిపారు.

ప్రజలను భయాందోళనలకు గురిచేసే ప్రకటనలకు బదులు భరోసా ఇచ్చేలా మాట్లాడుతున్నామని అన్నారు. కరోనా కట్టడికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. అందుకే జాతీయస్థాయిలో తెలంగాణలో కరోనా మరణాలు తక్కువగా వస్తున్నాయని వెల్లడించారు. కరోనా మరణాలను తాము దాచిపెడుతున్నామని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని స్పష్టం చేశారు.

Related posts