*ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచిన ప్రభుత్వం..
*ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు..
*ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు..
*దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు..
*ఎక్స్ సర్వీస్మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు..
తెలంగాణలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మరో శుభవార్త వినిపించారు. ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగ నియమాకాలను చేపడుతామని కేసీఆర్ చెప్పారు.
పోలీస్ శాఖ మినహాయించి అన్ని ఉద్యోగాలకు అభ్యర్ధుల వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ తెలిపారు.
ఉద్యోగాల భర్తీకి వయోపరిమి ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు.ఎక్స్ సర్వీస్మెన్లకు 47 ఏళ్లకు గరిష్ట వయోపరిమితిని పెంచినట్టుగా తెలిపారు.
గుళ్లు,గోపురాలకు తిరగడానికే గవర్నర్: వీహెచ్