బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ). దిగ్గజ నటుడు అబితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ప్రస్తుతం 12వ సీజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ కార్యక్రమం మరో వివాదంలో చిక్కుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రశ్నను అడిగారని పేర్కొంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత శుక్రవారం నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్లో సామాజిక వేత్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోనీ పాల్గొన్నారు. వీరిని రూ.6,40,000 ప్రైజ్మనీ ప్రశ్నగా.. ‘డిసెంబర్ 25, 1927న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు’ అని అడిగారు. వీటికి ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి అని ఆప్షన్స్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత అమితాబ్ మాట్లాడుతూ.. కుల వివక్ష, అస్పృశ్యతను పెంపొందించేలా ఉందనే కారణంతో మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టారని పేర్కొన్నారు. ఇది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులో తెలిపాడు. దీంతో బిగ్బీతో పాటు షో నిర్వహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.
previous post
next post