telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. కల్వకుంట్ల కవితను కూడా .. కాటేసిన దోమ.. ఆసుపత్రిపాలు..

kavita suffering from viral fever

సీఎం చంద్రశేకర్ రావు కూతురు కల్వకుంట్ల కవిత కూడా దోమ కాటుకు గురయ్యారు. దాంతో ఆమెకు విష జ్వరం సోకినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం కవిత స్థానిక ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో విషజ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయనడంలో ఇంతకంటే ఆధారం ఇంకేంకావాలి అనే భావన కలుగుతోంది. ఈ వైరల్ ఫీవర్ స్వయానా చంద్రశేఖర్ రావు కూతురినే వదలలేదు. కవిత విష జ్వరంతో ఆమె సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.

ఐటీ మరియు మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆస్పత్రికి వెళ్లి తన సోదరిని పరామర్శించారు. ఆస్పత్రిలో 20 నిమిషాలపాటు గడిపిన కేటీఆర్ కవితతో మాట్లాడారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆస్పత్రికి వెళ్లారు. కూతురిని పరామర్శించిన సీఎం కాసేపు డాక్టర్లతో వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లి పోయారు. దోమ కాటు వల్ల ఇలాంటి జ్వరాలు వస్తాయని, ఆందోళన చెందిల్సిన అవసరం లేదని డాక్టర్లు పేర్కొనడం కొస మెరుపు.

Related posts