జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్ శివార్లలోని రణ్బీర్గఢ్లో ఉగ్రవాదులు ఉన్నారనే ముందస్తు సమాచారంతో భద్రత దళాలు, సీఆర్పీఎఫ్ బలగాలు, జమ్ముకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు శనివారం కూంబింగ్ చేపట్టాయి.
ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తిరిగి భద్రతా దళాలలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరి నుంచి ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారని, వారికోసం గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.