వరుస వైఫల్యాల తరువాత కార్తీ తన స్పీడ్ను పెంచాడు. ప్రస్తుతం ఓ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాడు. తాజాగా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించబోతున్నారు కార్తీ. ఆయన గతంలో శివకార్తికేయన్కు “రెమో” వంటి హిట్ చిత్రాన్ని అందించారు. శనివారం కార్తీ పుట్టినరోజు సందర్భంగా కార్తీ, రష్మిక హీరోహీరోయిన్లుగా డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న కొత్త చిత్రానికి “సుల్తాన్” అనే టైటిల్ను ఖరారు చేశారు. కార్తీ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో “ఖైదీ” చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే జీతూ జోసఫ్ దర్శకత్వంలో తన వదిన జ్యోతికతో కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జ్యోతిక తమ్ముడిగా కార్తీ నటిస్తున్న విషయం తెలిసిందే. “సుల్తాన్” చిత్రం ద్వారా రష్మిక కోలీవుడ్కు పరిచయం కానుంది.
ఆమె బిగ్ బాస్ లోకి రెండోసారి ఫుల్లుగా తాగి ఎంట్రీ ఇచ్చింది… కమెడియన్ షాకింగ్ కామెంట్స్