కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. సీఎం యడియూరప్ప కేబినెట్ లో 17 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు.ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేశ్ కు కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. అధేవిదంగా మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.