*స్కూల్ ముందే కొట్టుకున్న బాలికలు
*20మందికిపైగా బాలికల మధ్య భీకర ఫైట్ ..
*జుట్లు పట్టుకుని, పిడిగుద్దులతో కొట్టుకున్న బాలికలు..
*సోషల్ మీడియాలో వీడియో వైరల్
కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థుల ఘర్షణకు దిగారు. స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన బాలికలు ఓ రేంజ్లో తన్నుకున్నారు.
స్కూల్ ముందే 20 మందికిపైగా బాలికలు జట్లు పట్టుకుని.. గట్టిగా కేకలు వేస్తూ ఒకరిపై ఒకరు బేస్ బాల్ బ్యాట్తో, పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.
వీరంతా బెంగళూరులోని బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు, మరో పాఠశాలకు చెందిన అమ్మాయిలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
వారి గొడవకు కారణమేంటో తెలియదు కానీ.. ఆ అమ్మాయిల మధ్య ఘర్షణను ఆపడం అక్కడున్న వారి వల్ల కాలేదు. మంగళవారం మధ్యాహ్నం విట్టల్ మాల్యా రోడ్డు సమీపంలో ఇది జరిగింది.
స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయిలు, సివిల్ డ్రెస్లో ఉన్న అమ్మాయిలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022