telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరీనా కపూర్, ఆలియా భట్ ఇన్‌స్టా కామెంట్స్ సెక్షన్‌ బ్లాక్

Bollywood

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు కారణం బాలీవుడ్‌లోని నెపోటిజమ్ కారణమంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లోని స్టార్ వారసులను, వారిని బాగా ఎంకరేజ్ చేసే వారిని తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు కరీనా కపూర్, ఆలియా భట్, దర్శకనిర్మాత కరణ్ జోహార్ నెటిజన్లకు ప్రధాన టార్గెట్లుగా మారారు. కొందరు వీరిని అన్ ఫాలో చేసేశారు. మరి కొందరు వీరిని అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారు. దీంతో వీరు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల కామెంట్స్ సెక్షన్‌ను లాక్ చేసుకున్నారు. తమ సర్కిల్‌లోని వారు తప్ప మిగిలిన వారెవరూ కామెంట్లు పెట్టకుండా సెట్టింగ్స్ మార్చుకున్నారట. షారూక్ కూతురు సుహానా ఖాన్ కూడా ఇలాగే చేసిందట. సొనాక్షి వంటి హీరోయిన్లు తమ ట్విటర్ ఖాతాలనే వదులుకున్నారు.

Related posts