telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కాపులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు: జనసేన నేత

janasena

కాపులను వైసీపీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ విమర్శించారు. కాపుల కోసం రూ.4,790 కోట్లు ఖర్చు పెట్టామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని దీనిపై శ్వేత పత్రం ప్రకటించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ డిమాండ్‌కు స్పందించకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

న్యాయ సమ్మతంగా కాపులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మరాఠా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినట్లే.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.ఏపీలో కాపుల సమస్యను పరిష్కరిస్తామని శివశంకర్ హామీ ఇచ్చారు.

Related posts