కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం అభిమానులు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. వేలాది మంది అభిమానులకు గుండె కోత మిగిల్చి భువి నుంచి దివికేగారు..
వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి మొదలవ్వడంతో పునీత్.. వెంటనే బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. వెంటనే వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే పునీత్ తుదిశ్వాస విడిచారు.
ఇప్పటికీ పునీత్ మరణ విషాదం నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. సినిమా హీరోగానే కాకుండా.. ఆయన రియల్ హీరోగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అందరి మనసుల్లో చెరిగిపోని ముద్రవేసుకున్నారు. బతికున్నంతకాలం.. ఆయన ఎందరికో అండగా నిలిచి.. సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
పునీత్ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ కన్నడలో స్టార్ హీరోగా మెరిసారు. తండ్రి వారసత్వం స్వీకరించిన పునీత్ రాజ్ కుమార్ తరువాత స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.
అయితే బెంగుళూరుకు చెందిన కరణ్ ఆచార్య అనే ఓ వీరాభిమాని ఆలోచనను వచ్చిన పెయింటింగ్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ పెయింటింగ్ లో తన తండ్రి రాజ్ కుమార్ ను పునీత్ వైకుంఠం లో కలుసుకున్నట్టు కనిపిస్తోంది. కళ్ళు మూసి ఎవరో చెప్పుకో చూద్దాం…అంటూ దాగుడు మూతలు ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
ఈ పెయింటింగ్ చూసిన వారికి గుండె బరువెక్కక మానదు..అంత హార్ట్ టచింగ్గా ఉంది.
సోనాక్షి సిన్హాపై “శక్తిమాన్” కౌంటర్…!?