telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూపర్ స్టార్ సినిమాలో కన్నడ స్టార్…?

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురాంతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తొలిసారిగా పని చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎమ్‌బి 27గా పిలువబడే ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన మే 31 న మహేష్ బాబు తండ్రి పుట్టినరోజున వెలువడుతుందని భావిస్తున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ స్టార్ ఉపేంద్ర నటుడు కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం ప్రకారం నిర్మాతలు ఈ సినిమాలో కీలకపాత్ర కోసం ఇప్పటికే ఉపేంద్రను సంప్రదించారని, ఉపేంద్రకు తన పాత్ర బాగా నచ్చిందని, అయితే ఆయన ఇంకా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఉపేంద్ర చివరిసారిగా 2015 లో అల్లు అర్జున్ నటించిన “సన్ అఫ్ సత్యమూర్తి” చిత్రంలో కన్పించారు. ఇక మహేష్ బాబు విషయానికొస్తే… ఇటీవల “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత “మహర్షి”లాంటి భారీ హిట్ ను అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తరువాత ప్రాజెక్ట్ ఉండనుంది.

Related posts