telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనా రనౌత్‌కు జరిమానా… హైకోర్టును కోరిన బీఏంసీ

Kangana

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై, డ్రగ్స్ వ్యవహారంపై కంగనా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు తీరుపై, మరోవైపు బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు చేస్తూ కంగనా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అయితే ఇటీవల కంగనా ఆఫీసు అక్రమ కట్టడమంటూ బీఎంసీన (బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు గోడలను కూల్చేశారు. దీనిపై కంగనా ఏకంగా ముంబై హైకోర్టులో కేసు వేసింది. తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లించేలా చూడాలని కంగనా కోరారు. అయితే చట్టపరంగా చేసిన చర్యను తప్పుపడుతూ కంగనా కోర్టులో కేసు వేయడం తప్పని, కంగనా పిటిషన్‌ను కొట్టేయాలని శుక్రవారం బీఎంసీ హైకోర్టుకు విన్నవించింది. అంతే కాకుండా చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్‌ వేసినందుకు కంగనా రనౌత్‌కు జరిమానాను విధించాలని కూడా బీఎంసీ కోర్టును కోరింది.

Related posts