telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్భయ నిందితులతో పాటే ఆమెను కూడా జైల్లో… కంగనా సంచలన వ్యాఖ్యలు

kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగన నటించిన ‘పంగా’ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా కంగనా వద్ద నిర్భయ కేసు నిందితుల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా… ఇలాంటి వారిని వెంటనే ఉరి తీయాలన్నారు. నిందితులలో ఒక వ్యక్తి తాను మైనర్‌ను అని చెబుతున్నాడని, అయితే ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని మైనర్‌గా పరిగణించకూడదన్నారు. ఇలాంటి వారిని నడిరోడ్డుపై చంపేయాలన్నారు. అత్యాచారాలకు పాల్పడితే పరిణామాలు ఎలావుంటాయో వారికి తెలియాలన్నారు. ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఇలాంటి నిందితులను క్షమించాలని కోరుతున్నారనే విషయాన్ని ప్రస్తావించిన కంగన… ఇందిరా జైసింగ్ లాంటి వారి గర్భం నుంచే రేపిస్టులు పుడతారని అన్నారు. ఇలాంటి మహిళలను రేపిస్టులతో పాటు 4 రోజులు జైలులో ఉంచాలన్నారు. కొద్ది రోజుల క్రితం ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లితో నిందితులను క్షమించాలని కోరారు. ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలపై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Related posts