telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బహిరంగ బెదిరింపులు… ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్ : కంగనా

Kangana

సుశాంత్ సూసైడ్ కేసు విచారణలో భాగంగా ఆయన ప్రేయసి రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్లతో సంబంధాలున్నాయని తెలియడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బాలీవుడ్ హీరోలంతా అడ్డంగా బుక్కవుతారని, అగ్ర నటులందరి రక్త నమూనాలు తీసుకుంటే ఎన్నో రహస్యాలు బయట పడతాయని, ఇండస్ట్రీలో నెలకొన్న నెపోటిజం, డ్రగ్స్ కల్చర్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఈ క్రమంలో శివసేన కీలక నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ ముంబై పోలీసులపై విశ్వాసం లేనట్టయితే మళ్లీ వెనక్కి రావద్దంటూ కంగనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ రౌత్ పై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముంబైకి తిరిగి రావద్దంటూ ఆయన తనను ఓపెన్ గా బెదిరించారని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ముంబై వీధుల్లోని గోడలపై ఇప్పటి వరకు ఆజాదీ రాతలను చూశామని… ఇప్పుడు బహిరంగ బెదిరింపులను చూస్తున్నామని మండిపడింది. ముంబై తనకు పాక్ ఆక్రమిత కశ్మీర్ మాదిరి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ‘బేబీ పెంగ్విన్’ అంటూ ఆరోపణలు చేసింది కంగనా.

Related posts