telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో దీపికా… డ్రగ్స్ వాడకానికి పర్యావసానమే డిప్రెషన్ అంటున్న కంగనా

Kangana

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ వాడినట్లు, డ్రగ్స్ పెడల్స్‌తో తనకు కాంటాక్ట్స్ ఉన్నట్లు ఒప్పుకున్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటపెట్టడం సెన్సేషన్ కాగా, ఇప్పుడు దీపిక పేరు కూడా బయటకురావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో దీపికపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. దీపిక గతంలో మానసిక కుంగుబాటుకు గురైన సంగతి తెలిసిందే. దానిని డ్రగ్స్ కేసుకు ముడిపెడుతూ కంగన ట్వీట్ చేసింది. “డ్రగ్స్ వాడకానికి పర్యావసానమే డిప్రెషన్. క్లాస్‌గా కనబడే ధనవంతులైన స్టార్ పిల్లలు వాళ్ల మేనేజర్లను మాల్ గురించి అడుగుతుంటారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వాళ్లను, దీపికా పదుకొనేను బాయ్‌కాట్ చేయాలి” అని కంగన పేర్కొంది.

ఎన్‌సీబీ అధికారులు సోమవారం రోజు టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను విచారించగా స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చినట్లు ప్రముఖ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. జయ వాట్సాప్ చాట్ చేసిన దాన్ని బట్టి ఆమె దీపికా పర్సనల్ మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చర్చించిందని ఎన్‌సీబీ అధికారుల దృష్టికి వచ్చింది. అందులో ఉన్న కోడ్‌ భాషలో D అంటే దీపిక అని, K అంటే కరిష్మా అని అనుమానిస్తోంది ఎన్‌సీబీ అధికార బృందం. ఈ మేరకు ఇప్పటికే దీపికా మేనేజర్‌ కరిష్మాకు సమన్లు జారీ చేయడం జరిగింది. ఇక జయా సాహా ఇచ్చిన సమాచారాన్ని బట్టి నిర్మాత మధు మంతెనకు కూడా సమన్లు జారీ చేశారు. దీపిక పదుకొనే, శ్రద్ధాకపూర్‌లకు ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే హీరోయిన్లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్, డిజైనర్‌ సిమోన్‌ ఖంబాటాలకు ఈ వారంలోనే సమన్లు జారీ చేయనున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ మీడియాకు తెలిపారు.

Related posts