telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రస్తుతం అగ్రస్థానంలో టాలీవుడ్… : కంగనా

Kangana

వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్ ఇప్పుడు దేశంలో టాలీవుడ్ పెద్దదని అంటూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై స్పందించిన కంగనా రనౌత్ “దేశంలో నెంబర్ వన్ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది. తరుచూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ హిందీ చిత్ర పరిశ్రమకు సవాలు విసురుతోంది. చాలా హిందీ సినిమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్‌ జరుపుకుంటాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు ఒక్కటై భారతీయ సినీ పరిశ్రమగా ఏర్పడాలి. మనదేశంలో ఒక్కో భాషకు ఒక్కో ఇండస్ట్రీ ఉండటం వల్ల హాలీవుడ్‌ లాభపడుతోంది” అని కంగనా ట్వీట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఓ వర్గం తీవ్రంగా మండిపడుతోంది. తాజాగా బాలీవుడ్‌ను తక్కువ చేస్తూ ఆమె చేసి ట్వీట్‌ ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో చూడాలి.

Related posts