telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి కంగనా సిస్టర్స్ కు సమన్లు

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. గత కొన్నిరోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పై కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత కంగనా రనౌత్ ఒక పక్క మొత్తం బాలీవుడ్ ఒక పక్క అన్నట్టు మారిపోయింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి​కి ముంబయిలోని బాంద్రా పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. నవంబరు 9,10 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కంగనా సిస్టర్స్ బాలీవుడ్ పేరును దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ​ ఫిట్​నెస్​ ట్రైనర్​ సయ్యద్ కేసు పెట్టారు. మతపరమైన గొడవలు సృష్టించేలా సోషల్​మీడియా వేదికగా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నెపోటిజమ్​, డ్రగ్స్​ గురించి కూడా వారి వ్యాఖ్యలు అభ్యంతరకరమని పేర్కొన్నారు. కంగనా సిస్టర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబయి పోలీసులు కంగనా సిస్టర్స్​పై కేసు నమోదు చేసి వారిని విచారణకు రావాలని నోటీసులు పంపారు. ఇంతకుముందే అక్టోబర్ 26, 27న విచారణకు హాజరు కావాల్సిందిగా కంగనా సిస్టర్స్​కు సమన్లు పంపారు పోలీసులు. అయితే అప్పుడు వారిద్దరు గైర్హాజరయ్యారు. వారి సోదరుడి పెళ్లి సందర్భంగా విచారణకు రాలేకపోయారంటూ కంగన తరఫు లాయర్ జమీందర్​ పోలీసులకు లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వారికి మరోసారి సమన్లు పంపారు ముంబయి పోలీసులు.

Related posts