telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరో ఎక్కువ మోతాదులో డ్రగ్స్… భార్య విడాకులు ఇచ్చేసింది… కంగనా షాకింగ్ వ్యాఖ్యలు

kangana

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సప్‌ చాటింగ్‌పై పోలీసులు ఆరా తీయగా ఆమెకు ఇండస్ట్రీ పెద్దలతో పాటు డ్రగ్స్ డీలర్లతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయని తేలడంతో ఈ అంశం ఎన్నో అనముమానాలు రేకెత్తిస్తూ పలు చర్చలకు తావిచ్చింది. సరిగ్గా ఈ తరుణంలో హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి రెచ్చిపోయింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగితే బాలీవుడ్ హీరోలంతా అడ్డంగా బుక్కవుతారని, అగ్ర నటులందరి రక్త నమూనాలు తీసుకుంటే ఎన్నో రహస్యాలు బయట పడతాయంటూ సంచలన కామెంట్స్ చేసిన కంగన.. తాజాగా ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఓ స్టార్ హీరో డ్రగ్స్‌కి బానిసై ఆసుపత్రి పాలయ్యాడని చెబుతూ కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. ఆ హీరో డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం కారణంగా అతని భార్య కూడా విడాకులు ఇచ్చేసిందని, ఆ స‌మ‌యంలోనే తాను అత‌నితో డేటింగ్ చేశానంటూ సంచలన కామెంట్స్ చేసింది కంగన. అయితే ఆ హీరో కుటుంబ సభ్యులు తనను వేధించారని పేర్కొంది. అలాగే ఇండస్ట్రీలో గురువు అని చెప్పుకునే వ్యక్తే తనకు డ్రగ్స్ రుచి చూపించాడంటూ మరో బాంబ్ పేల్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ కంపు కొడుతోందని, 99 శాతం మంది డ్రగ్స్ లేకుండా ఉండలేక పోతున్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది కంగన. అయితే ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు. దీంతో మరోసారి బాలీవుడ్ లో దుమారం రేగింది.

Related posts