బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. కంగనా నటించిన “మణికర్ణిక” సినిమా హిట్ తో పాటు బాక్స్ ఆఫీస్ వ్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించకపోవడంతో కంగన వీలైనప్పుడల్లా వారిపై విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా “మణికర్ణిక” సినిమా బుచియన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. తన సినిమాకు ఇంత గొప్ప గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని కంగనా తెలిపింది. ఈ సందర్భంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు చేసింది. “మూవీ మాఫియా నా సినిమాను చంపేయాలనుకుంది. `గల్లీబాయ్` సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖులందరూ మాట్లాడారు. నా సినిమా గురించి ఒక్కరూ మాట్లాడలేదు. అయినా మా సినిమా కమర్షియల్గా విజయం సాధించింది. మంచి సినిమాను ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది” అని కంగనా అన్నారు.
“ఒక్కరే మహానటి కాదు” జయసుధ కామెంట్స్… హీరోలపై టియస్సార్ సెటైర్లు