రజినీకాంత్తో తన స్నేహం 44 ఏళ్లుగా కొనసాగుతోందని నటుడు, ఎంఎన్ఎం(మక్కల్ నీది మయ్యమ్) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మీడియాతో అన్నారు. మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం తామిద్దరం కలిసి పోరాడతామని ఈ సందర్భంగా కమల్ తెలిపారు. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, నట విశ్వరూపం కమల్ హాసన్ అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీ అయ్యారు. కమల్ ఎంఎన్ఎం పార్టీ స్థాపించి, గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా, పార్టీ ప్రకటించిన రజినీ.. ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
తమిళనాడులో ఏదైనా సమస్య ఎదురైతే.. తామిద్దరం కలిసి పోరాడతామని ఈ సందర్భంగా కమల్ తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్షా హిందీ భాషను దేశంలోని ప్రతి రాష్ట్రంలో తప్పనిసరి చేస్తామని ప్రకటించినప్పుడు.. రాష్ట్ర ప్రజలతో పాటు కమల్, రజినీ కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళ భాషను వదులుకునేది లేదని వారు కరాఖండిగా చెప్పే సరికి కేంద్రం కూడా ఈ విషయంపై వెనక్కి తగ్గింది.
ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి: చంద్రబాబు