కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారైన సూపర్స్టార్ రజినీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందనే వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ఇప్పుడు. ఇటీవల ‘దర్బార్’ సినిమాతో తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన తలైవా ప్రస్తుతం తన 168వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే 169వ సినిమాకు సన్నాహాలు జరిగిపోతున్నాయని తెలుస్తోంది. తలైవా 169వ సినిమాకు రాజ్కమల్ ఫిలింస్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీయాలంటే రజినీ, కమల్ స్పందించాలి. ఇదే గనక నిజమైతే తమిళనాడు ప్రజలకు నిజంగా ఈ సినిమా ఓ పండుగ అవుతుంది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి పనిచేయబోయే సినిమా ఇదే అవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
previous post
మంచు ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది..