తమిళ అగ్రకథానాయకుడు కమల్హాసన్ డిసెంబర్ 4 న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయన.. ఐసోలేషన్ నుంచి బయటకొచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి సిబ్బందితో కలిసి ఆయన దిగిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది.
నవంబరు 22న కమల్ హాసన్కు కరోనా సోకింది. అమెరికా నుంచి భారత్కు చేరుకున్న తర్వాత పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యిందని కమల్ ట్విట్టర్లో తెలిపారు. అప్పటి నుంచి చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే డిసెంబరు 1న కరోనా నుంచి ఆయన కోలుకున్నట్లు శ్రీరామచంద్ర ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కానీ డిసెంబరు 3 వరకు ఆయన ఐసోలేషన్లోనే ఉంటారని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.
కాగా..ఆసుపత్రిలో 13 రోజులు చికిత్స తరువాత, కోవిడ్ -19 నుండి కోలుకోవడంతో కమల్ హాసన్ శనివారం ఇంటికి తిరిగి వచ్చారు. డిశ్చార్జ్ అయిన వెంటనే, కమల్ హాసన్ తాను హోస్ట్ చేసే రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సెట్స్కు వెళ్లాడు.
త్వరలోనే కమల్.. ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘ఇండియన్ 2’లోనూ కమల్ నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభిమైన ఈ సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది.
స్నేక్ బాబు… ఏడేళ్ళు వాళ్ళ కూడు తిని కాటు వేస్తావా ? : శ్రీరెడ్డి