telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటుడు శింబు తో .. కళ్యాణి ప్రియదర్శిని .. త్వరలో సెట్స్ కి.. !

kalyani priyadarsini with simbu on new project

కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు ‘హలో’ చిత్రం ద్వారా దగ్గరైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన వెంటనే ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు రాలేదు. అయినా కూడా మెగా కుటుంబం నుండి సాయితేజ్ సరసన ఆమె చేసిన ‘చిత్రలహరి’ వచ్చేనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఈ అమ్మాయి చేసిన ప్రయత్నాలు ఫలించి వరుస అవకాశాలు వస్తున్నాయి.

kalyani priyadarsini with simbu on new projecta తమిళంలో కళ్యాణి శివకార్తికేయన్ సరసన ‘హీరో’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో .. మరో ప్రాజెక్టుకు కూడా కల్యాణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శింబు హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు ఒక పొలిటికల్ డ్రామాను పట్టాలెక్కించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన కల్యాణిని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ‘మాన్నాడు’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.

Related posts