అందాల తార కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆమె గర్భావతి అనే విషయం ఖరారైన తర్వాత అప్పటికే ఒప్పుకున్న సినిమాలను సైతం క్యాన్సిల్ చేసుకుని.. హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న కాజల్ అగర్వాల్ దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చింది. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, తన శరీరం, ముఖం గురించి పలువురు నెటిజన్లు విపరీత కామెంట్లు చేశారు. దీంతో వారిపై ఫైర్ అయిన కాజల్.. తాను అలాంటి పట్టించుకోనని బదులిచ్చింది. సోషల్ మీడియాలో చాలా పెద్ద పోస్ట్ పెట్టింది.
అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో మార్పులు సహజమే. కానీ కొందరు కాజల్ శరీరాకృతి గురించి నెగెటివ్గా కామెంట్ చేశారు. దీనిపై కాజల్ గట్టిగానే స్పందించింది. నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను నా శరీరంలో, నా జీవితంలో కలిగిన మార్పులని ఎంజాయ్ చేస్తున్నాను.
అర్థం చేసుకోలేని మూర్ఖుల కోసం చెబుతున్నా.. గర్భవతి అయ్యాక శరీరంలో హార్మోనుల వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. బాడీ తల్లి అయ్యేందుకు అన్ని విధాలుగా రెడీ అవుతూ ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడం సహజం అని కాజల్ పేర్కొంది. వాటన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి.
నాలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారికి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో సహా మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ పొట్ట పెద్దదవుతుంది. శరీరం సాగినప్పుడు కొందరికి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడుతాయి. మరికొన్నిసార్లు చర్మం చిట్లుతుంది. సాధారణ సమయంలో కంటే ప్రెగ్నెన్సీ టైంలో త్వరగా అలిసిపోతాం, మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి.
ప్రతికూలంగా ఆలోచించడం వల్ల అనారోగ్యంబారిన పడతాం. ఇక బిడ్డ పుట్టాక మళ్లీ మునుపటిలా అవడానికి కొంత సమయం పట్టవచ్చు, లేదంటే మునుపటి స్థితికి మన శరీరం రాకపోవచ్చు కూడా. అయినా సరే, ఏం పర్లేదు. ఈ మార్పులన్నీ సర్వసాధారణమే. మన జీవితాల్లోకి ఓ పాపాయి రాబోతుందన్నప్పుడు వాటన్నింటినీ పట్టుకుని వేలాడుతూ అసౌకర్యంగా, ఒత్తిడిగా ఫీలవకండి. చిన్నారికి జన్మనివ్వడం అనేది వేడుక అన్న విషయాన్ని గుర్తుంచుకోండి’ అని కాజల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది.
ప్రస్తుతం కాజల్ నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఇందులో నటించింది. దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’లోనూ హీరోయిన్గా చేసింది. ఈ చిత్రాలు రెండూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
శ్రీముఖి అంటేనే ఇష్టం… : రాహుల్ తల్లి సుధారాణి