కాజల్ ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు రమేష్ అరవింద్ ‘పారిస్ పారిస్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో విజయం సాధించిన ‘క్వీన్’ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు నోచుకోవడంలేదు. ఆ మధ్య చిత్ర దర్శక నిర్మాతలు ‘పారిస్ పారిస్’ను సెన్సార్ ముందుకు తీసుకెళ్లారు. అయితే అక్కడే టీమ్కు పెద్ద షాక్ తగిలింది. ఈ మూవీలో అసభ్యకర సీన్లు ఉన్నాయని చెప్పిన సెన్సార్ బోర్డు.. దాదాపు 25 సీన్లకు కత్తెర వేసింది. దీనిపై కాజల్ కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇక లాభం లేదని ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చెయ్యాలని చిత్రయూనిట్ భావిస్తున్నారట. ఓటీటీలో విడుదలకు సెన్సార్ తో సంబంధం లేదు. ప్రస్తుతం నాలుగు భాషలకు చెందిన సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో ప్రముఖ ఓటీటీతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం.
previous post
next post