*ఈ నెల 16న ఢిల్లీలో కేఏ పాల్ మౌనదీక్ష
*కేసీఆర్, జగన్ వస్తానంటే ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్స్ వేయిస్తా
*విభజన హామీలు అమలు చేయాలని పాల్ డిమాండ్
*తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం
*తనను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తా
ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులకు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేసీఆర్, వైఎస్ జగన్ తనతో కలిసొస్తే విభజన హామీలను సాధిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఏపీ, తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల సాధన కోసం ఈ నెల 16న ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. రాజ్ఘాట్ వేదికగా తాను చేయబోయే ఆందోళనలో కలిసి రావాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ జగన్ వస్తానంటే ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్స్ వేయిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక్క మూడు గంటలు తనతో కలిసి మౌనదీక్ష చేపట్టాలని కేసీఆర్, జగన్కు కోరుతున్నానని అన్నారు.జూలై 16న చేపట్టబోయే మౌనదీక్షకు ఏపీ తెలంగాణకు చెందిన అన్నీ పార్టీలను ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు, పవన్, షర్మిళ, ఆర్ ఎస్ ప్రవీణ్కుమార్, కోదండరాం..సహాఅందరూ రావలంటూ కేఏపాల్ అన్నారు
తనను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తానన్నారు. ఆ తరువాత ప్రధానిగా అవకాశం వస్తే ప్రజాశాంతి పార్టీ సత్తా ఏంటో చూపిస్తానంటూ కేఏపాల్ వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్