వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని నవంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, చిత్రానికి సంబంధించి రోజుకో అప్డేట్ తో వార్తల్లో నిలుస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 2 ట్రైలర్లను, పలు పాటలను విడుదల చేసి సంచలనం సృష్టించాడు వర్మ. అయితే ఇప్పుడు ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనను అవమానించేలా మూవీలో సన్నివేశాలు ఉన్నాయంటూ పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల నిలిపేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, దర్శకుడు రాంగోపాల్ వర్మ, హాస్యనటుడు రాము తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషన్ పై హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఈ నెల 29న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
next post
ఆధారాలతో సహా కౌశల్ మీడియా సమావేశం