telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హెలీకాప్టర్ గుర్తుకు ఓటు వేసి జగన్‌ను ఇంటికి పంపాలి: కేఏ పాల్

KA Paul comments Chandrababu

వైసీపీ అధినేత జగన్‌ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు కురిపించారు. పులివెందులలో చిన్నకుర్రాడిని నిలబెట్టి జగన్‌ను ఓడిస్తానని చెప్పారు. మంచి వ్యక్తిని ప్రజాశాంతి పార్టీ తరుపున బరిలోకి దింపామని తెలిపారు. అయితే జగన్ దగ్గర లక్ష కోట్ల రూపాయలున్నాయని, తమ అభ్యర్థి దగ్గర కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

పులివెందులలో తన పార్టీ తరుపున రెబల్ అభ్యర్థులను ఉద్దేశించి పాల్ మాట్లాడుతూ వీరికి తెలివిలేక ఓడిపోయే పార్టీల గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. గెలిచే పార్టీ, ప్రజాశాంతి పార్టీ అని వాళ్లకు తెలియదని పాల్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, జనసేనాని పవన్‌కు ఓటు వేయకూడదని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ అవినీతి పార్టీ కాదని వాళ్లే మాత్రమే అవినీతి పరులని ఆరోపించారు.హెలీకాప్టర్ గుర్తుకు ఓటు వేసి జగన్‌ను ఇంటికి పంపాలని పాల్ పిలుపునిచ్చారు.

Related posts