telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ చిత్రం సృష్టించిన రికార్డ్స్ కంటే మీతో పనిచేసిన ప్రతి రోజూ ఓ మంచి జ్ఞాపకం : చిరంజీవి

chiru

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఘరానామొగుడు’ చిత్రం 1992 ఏప్రిల్ 9న విడుదలైంది. అప్పట్లోనే రూ.10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. గురువారం నాటికి ఈ సినిమా విడుదలై 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాఘవేంద్రరావు ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు.కాలం పరిగెడుతోంది కానీ, చిరంజీవితో ఈ సినిమా కోసం చేసిన షూటింగ్ మెమరీస్ మాత్రం ఇప్పటికీ నా మైండ్‌లో ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇది మెగా స్పెషల్ ఫిలిం. మైలురాయి లాంటి చిత్రం. ‘ఘరానామొగుడు’ విడుదలై 28 ఏళ్లు పూర్తయింది. నా నిర్మాత దివంగత దేవీ వరప్రసాద్, చిత్ర బృందానికి కృతజ్ఞతలు’’ అని రాఘవేంద్రరావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో సెట్స్‌లో చిరంజీవితో ఉన్న ఫొటోను, ‘ఘరానామొగుడు’ పోస్టర్‌ను ట్వీట్‌లో పొందుపరిచారు. అయితే, రాఘవేంద్రరావు ట్వీట్‌కు చిరంజీవి స్పందించారు. ఈ మ్యాజిక్ ఘనత మీది సార్. ఈ చిత్రం సృష్టించిన రికార్డ్స్ కంటే, మీతో పనిచేసిన ప్రతి రోజూ ఓ మంచి జ్ఞాపకం. నటీనటులను పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ, మంచి నటనను రాబట్టుకున్న ఘరానా దర్శకుడు మీరు, కీరవాణి గారు, నిర్మాత దేవీ వరప్రసాద్ గారు ఈ విజయానికి మూలస్థంబాలు అని రాఘవేంద్రరావుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

Related posts