సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 3 రోజుల పాటు పర్యటించనున్నారు..ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.. 24నవ తేదీన తన స్వగ్రామం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరంకు వెళ్లనున్నారు ఎన్వీ రమణ..25వ తేదీన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జస్టిస్ రమణ తన స్వగ్రామానికి తొలిసారిగా వెళ్ళనున్నారు. ఇక, ఈ నెల 26న గుంటూరు – మంగళగిరి మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ హైకోర్టు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి రెండవ న్యాయాధికారుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఆయన పర్యటన కొనసాగుతుండగా…రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం వరంగల్ లో ఉన్నారు. హైదరాబాద్ లో తొలి సారిగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్..మీడియేషన్ కేంద్రాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించిన విషయం తెలిసిందే.
నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు