telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఇంజనీరింగ్ కాలేజీల .. ఫీజుల తగ్గింపు.. నిజమేనా..

justice eswarayya on engineering fee cut

ఇంజనీరింగ్ కాలేజీలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులను తగ్గించేందుకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. గతంలో కన్నా తక్కువగా ఉంటాయని.. ఈసారి కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఆయా కాలేజీల్లో ఉండే సౌకర్యాలు, ప్రమాణాలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఫీజులను నిర్ణయిస్తాం. ఫిబ్రవరి 4వరకు కాలేజీల వాదనలు విని.. ఆ నెల మధ్య వారంలో ఫీజులను ప్రకటిస్తాం. మెడికల్, ఫార్మా కాలేజీల్లో కూడా కమిషన్ బృందాలు తనిఖీలు చేస్తుండగా.. వాటి ఫీజుల విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. యూజీ, పీజీ, డిగ్రీ కోర్సులు, లా కోర్సులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల ఫీజులను కూడా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషనే ఖరారు చేస్తుంది.

ఫిబ్రవరి 10వ తేదీలోపు అన్ని కాలేజీలూ తమ ఫీజుల పట్టికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ఏడాది ఫీజుల నిర్ణయంలో కొంత జాప్యం కలగడం వల్ల 2020-21, 2022-23 విద్యాసంవత్సరాలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకే రకమైన ఫీజుల అమలవుతాయి. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు కమిషన్ నిర్ధారించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు గ్రీవెన్స్‌ సెల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నాం. విద్యార్థుల దగ్గర నుంచి ఏ కళాశాల ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను తీసుకోరాదు. కేవలం జిరాక్స్ కాపీలను వాటితో సరి చూసుకుని వెంటనే తిరిగి ఇచ్చేయాలి. సరైన వసతులు లేని కాలేజీలకు కొంత గడువు ఇస్తాం.. ఆలోపు లోపాలను సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకుంటామని ఈశ్వరయ్య అన్నారు.

Related posts